Header Banner

విమాన ప్రమాదానికి 58 వేల లీటర్ల ఫ్యూయెల్ నే కారణమా.. నిపుణుల అనుమానాలు!

  Thu Jun 12, 2025 17:11        India

అహ్మదాబాద్‌ మేఘానీనగర్‌ ప్రాంతంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. AI 171 విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే కుప్పకూలడం, ఈ ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణంగా మారింది. విమానంలో ఉన్న 58,000 లీటర్ల ఫ్యూయెల్ కారణంగా భారీ పేలుడు సంభవించి, పరిసర ప్రాంతాలు మంటలలో కూరుకుపోయాయి. నిపుణుల అంచనా ప్రకారం, టేకాఫ్ దశలో విమానంలో ఇంధనం పూర్తి స్థాయిలో ఉండటం వల్లే ఈ స్థాయి విధ్వంసం చోటు చేసుకుందని తెలుస్తోంది. ప్రమాదం సమయంలో విమానం పూర్తి వేగంతో నడుస్తుండటంతో పేలుడు తీవ్రత మరింత పెరిగింది.

ఇది కూడా చదవండి: అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం! ఫ్లైట్ లో 242 మందికి పైగా..

 ఈ ప్రాంతం జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో, పైలట్ అప్రమత్తతతో ల్యాండింగ్ ప్రయత్నం చేసినా, చుట్టూ ఉన్న చెట్లు, భవనాలు దానికి అడ్డు అయ్యాయి. అత్యవసర ల్యాండింగ్‌ కు వీలుకాకపోవడంతో BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలిపోయింది. విమాన శకలాలు భవనంపై పడిపోవడంతో పాటు, భారీ మంటలు వ్యాపించాయి. దాంతో భవనంలో ఉన్న విద్యార్థులకు తప్పించుకునే అవకాశం దాదాపుగా లేకుండాపోయింది. ఈ విషాద ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించేందుకు డిజి‌సిఎ (DGCA), ఎయిర్ ఇండియా, మరియు సివిల్ ఏవియేషన్ విభాగాలు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించాయి.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులునటీనటులుఅభిమానులు ఆవేదన వ్యక్తం

 

12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలిఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

ట్రైన్స్‌లో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా? ఈ విషయం తెలియకుండా వాటిని వాడకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #airindia #flight #crash #58000 #fuel #plane #ahemadabad #london #gujarath #pm